Friday, March 3, 2017

వేటిని కలిపి తినకూడదో తెలుసా

  • తేనే మరియు నెయ్యి కలిపి తినకూడదు. ఆ రెండింటి కలయిక విషపూరితమ‌యినది. 
  •  పెరుగు లేక మ‌జ్జిగ‌ను అరటి పండుతో కలిపి తినకూడదు. 
  •  కూరగాయలతో కలిపి వెన్న కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం.
  •  మొలలు ఉన్నవారు గుడ్లు, మాంసం తినకూడదు.  
  •  నెయ్యిని రాగి పాత్రలో ఉంచి తినకూడదు. 
  •  పొద్దునే మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తరువాత త్రాగవచ్చు. 
  •  అల్సర్ వ్యాధితో భాదపడుతున్నవారు కారాన్ని తినకూడదు. 
  •  చర్మ వ్యాధులు ఉన్నవారు పొట్లకాయ, పల్లీలు, ఎండు చేపలు, చిక్కుడుకాయలు తినకూడదు. 
  • నువ్వుల నూనెతో గోధుమకి చెందిన వంట‌ల‌ను చెయ్యకూడదు. మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు మాంసం, గుడ్లుతో చేసిన వంటలు తినకూడదు.
  •  చేపల కూర తిన్న వెంటనే పాలు కానీ, పెరుగు కానీ తినకూడదు.లావుగా ఉన్నవారు బియ్యంతో వండిన‌వి కాకుండా గోధుములతో వండిన‌ ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది.
  • ఆస్తమా రోగులు టమోటా, గుమ్మడికాయ, ముల్లంగి తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదు.

Subscribe to get more Posts :